రాజకీయ పునరావాస కేంద్రంగా పేరొందినది విధానమండలి. రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసినవాటిలో మేథావులు-ప్రజలు వ్యతిరేకించింది, అన్నిరాజకీయ పార్టీలకు ఉమ్మడి ప్రయోజనాత్మక మైనది విధానమండలి. నెలకు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం తప్పించి ప్రజలకు విధానమండలి వల్ల ఇప్పటివరకు కలిగిన ప్రయోజనాన్ని ఒక్కటికూడా చూపలేము. రాజకీయనాయకుల పార్టీ పరమైన వ్యతిరేక దూషణ లుతప్ప రాష్ట్ర ప్రయోజనాలకు , వ్యవహారాలకు సంబంధించి ఒక్క అంశంమీద ప్రయోజనాత్మకమైన, సమగ్రమైన డిబేట్ జరగలేదు. ఒకప్రక్క ప్రభుత్వం డబ్బు లేదంటూ; పెన్షన్ విధానానికి మంగళం పాడి వారికి సంబంధించి మాత్రం చాలా అనుకూలంగా పదేపదే జీతాల పెంపు, ఇతర సౌకర్యాల విషయంలో అన్ని పార్టీలు సోదర భావంతో సామరస్యంగా సత్వరమే నిర్ణయాలు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడంలో రాజకీయ పార్టీలన్నీ ఒకటే అని నిరూపించాయి.నిరుపయోగమైన విదానమండలిని రద్దు చెయ్యాలని ప్రజలు,మేధావులు,రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే వారు గట్టిగా డిమాండ్ చెయ్యాలి. సోషల్ నెట్ వర్క్స్ ద్వారా ప్రజలను మనందరం చైతన్య పరచాలని అనకాపల్లి న్యూస్ .కాం ఆశిస్తున్నాను.
No comments:
Post a Comment