Tuesday, June 5, 2012

అపర బిజినెస్ గాంధీ.


ఆ గాంధీకి "కోట్లు" లేవు. ఆ గాంధీకి మొలమీద తప్ప వంటిమీద బట్టలేదు. ఆ గాంధీకి పదవులపై ఆశ లేదు. ఈ అపర గాంధీ కి లేనిది లేదు. ఆయనెవరో కాదు, లగడపాటి. డబ్బుంటే చాలు, నాయకుడై పోవచ్చు.  ప్రజాసేవ పేరుతో అందరిలా ఆయనకూడా అలా రాజకీయాల్లోకి వచ్చినవాడే! "సమైక్యాంధ్ర" పేరుతో ఇంకాస్త వెలుగు లోకి వచ్చాడు లగడపాటి.  తనవల్లే రాష్ట్రం విడిపోకుండా ఉందని రాష్ట్ర ప్రజలకు బిల్డప్ ఇస్తున్నాడు. ఇది చాలదన్నట్లు చేతిలో జెండాను పట్టుకుని గాంధీ గారిలా పాద యాత్రలు చేస్తూ ప్రయాసపడుతున్నాడు, "నీవు మాకు ఏమిచేశావని ఓట్లు అడగడానికి వచ్చావని"అక్కడక్కడ ప్రజలచేత నిలదీయబడుతున్నాడు. కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్  రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ముఖ్యమంత్రి కాగా ఇంత చేసిన నాకేనా వీలుకానిది అనే భావనతో "ముఖ్య మంత్రి పీఠం" కోసం శ్రాయశక్తుల కృషి చేస్తున్నాడు. బహుశా బొత్సా ,చిరు సి.ఎం.పీఠం కోసం ప్రయ్తత్నిస్తుండగా నేనేమైనా తక్కువ తిన్నానా అని కాబోలు ఎన్నికల ప్రచారంలో రోజుకో కథ చెబుతున్నాడు, రోజుకో వేషం వేస్తున్నాడు. వై  .ఎస్.మరణాంతరం సి.ఎం.పీఠం ఎంత చులకనైంది?!      

No comments:

Post a Comment