ప్రకాశం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వాన్ పిక్ బాధితుల కు ఆశ చూపి ఓట్లుగా మలుచుకునే పనిలో బిజీగా ఉన్నారు. విచారణలో,వివాదంలో,కోర్ట్ పరిధిలో ఉన్న ఈ వ్యవహారాన్ని తను ముఖ్యమంత్రి దృష్టికి ,కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి పరష్కరిస్తానని బాధితులకు ఆశచూపుతున్నాడు.ప్రజలకు నామమాత్రంగా ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకొని ఎవరి భూములు వారికి ఇస్తారా ? అలాంటిది ఎమీలేకుండానే ఎవరి భూములు యధావిధిగా వారికే ఇస్తారా? ఎప్పటిలోపు ఇస్తారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం పి.ఎం.కూడా ఇవ్వలేడు. మరి మంత్రిగారు అరకపట్టి ఏరువాక అని వాన్ పిక్ ఏకరువు పెడుతున్నారెందుకంటే కేవలం ఓట్ల కోసమే ! ఎన్నికలయ్యాక మంత్రి గారిచ్చిన మాటపై కార్యరూపం దాల్చనప్పుడు భాదితులు నిలదీసే రోజువస్తుంది. ఇది సత్యం.
No comments:
Post a Comment