Monday, June 11, 2012

జగన్ ప్రత్యర్థులకు తీరని కోరిక


     వై.కా.పా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో అన్ని పార్టీలు, అన్ని మీడియా లు ఒకటయ్యాయి. నిబంధనలను అతిక్రమిస్తూ అధికారులు ప్రభుత్వాధి నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. జడ్ కేటగిరి ఉన్న జగన్ ని నాలుగు రోజులపాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ఎంతో బద్రతతో తీసుకువెళ్ళిన పోలీస్ అధికారులు పైఅదికారులు, నాయకుల ఆదేశాలను అనుసరించి చివరి రోజున మామూలు ఖైదీలను తీసుకు పోయే వ్యానులో కోర్టుకు హాజరు పరిచారు. అలా తీసుకు వెళ్ళడం జగన్ వ్యతిరేకులకు ఆనందాన్ని కలిగించింది.  జగన్ పై వారి అక్కసు ఎలావుందంటే ...."అంకుశం"సినిమాలో బేడీలు వేసి నడిరోద్దుమీదనుంచి నడిపించుకొని తీసుకు వెళ్ళినట్లు నిజంగానే జగన్ ను అలా తీసుకువెళ్ళా లన్నట్లు ఆశపడుతున్నారు. జగన్ వ్యవహారంలో ప్రత్యర్థులకు తీరని కోరికగా పైన ప్రస్తావించిన విషయం ఉంది పోయింది. కాంగ్రెస్  ప్రభుత్వం బరి తెగించింది అన్న దానికి ఇటువంటి ఉదాహరణలు కొల్లలు. సి.బి.ఐ. ని కోర్ట్ మొట్టికాయలు వెయ్యడంతో మరల మునుపటిలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ లో జగన్ ను కస్టడీకి తీసుకు పోయారు.     

No comments:

Post a Comment