Tuesday, June 5, 2012

2014 ప్రధాని పదవి రాహుల్ గాంధీకి కలే!


భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భవించి, స్వాతంత్ర్యానంతరం నెహ్రు కుటుంబం స్వార్థం కోసం రాజకీయ పార్టీగా మలిచబడిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ.  ఇటువంటి కాంగ్రెస్ పార్టీ     2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి వారసత్వంగా రాహుల్ గాంధీని ప్రధానిపదవిలో కూర్చోబెట్టాలని వ్యూహం పన్నుతుంది. ఇది జరగని పని అని కాంగ్రెస్ వారు గ్రహించడం లేదు. ఈ మూడేళ్ళ పాలనా కాలం లో అనేక కుంభకోణాలు, ప్రజా వ్యతిరేక పనులు, అధిక ధరలు, చట్టాలను అనుకూలంగా మలుచుకొని వ్యవహరించిన తీరు. ఇటువంటివెన్నో ఇటీవలి కాలంలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి తార్కాణం. తన కుమారుడ్ని ప్రధానిగా చూసుకోవాలనే కోరిక సోనియాగాంధికి ఉంటే ఈ రెండేళ్ళ సమయాన్నైనా ప్రధాని పదవిగా ఉపయోగించుకుంటే మంచిదని మేథావులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా సోనియమ్మవదిలేసినట్లు కాంగ్రెస్ వారు సోనియాను త్యాగ మూర్తిగా అభివర్ణిస్తున్నారు. విదేశీయులు దేశ ప్రధాని లాంటి అత్యున్నత పదవి స్వీకరించ కూడదని బి.జే.పి.వారు తీవ్రంగా విమర్శించడంతో, దేశంలో ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో (మన్మోహన్ సింగ్ ను బొమ్మలా కూర్చోబెట్టి) ప్రధాని అధికారాలను సోనియా చలాయిస్తున్నారు అనే విషయాన్నీ ప్రజలు గ్రహించలేని అమాయకుల్ల అనామక నాయకులు అమాయకంగా మాట్లాడుతున్నారు. ఈసారి వారసత్వంగా గాంధీ కుటుంబం నుంచి ప్రధాని రావడాని ప్రజలు నిరోదించే క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ముందస్తు హెచ్చరికగా ప్రజలు కాంగ్రెస్ కు భవిష్యత్తును తెలియజేశారు.

No comments:

Post a Comment