నీడపట్టున హాయిగా కూర్చునే నాయకుల్ని ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపఎన్నికల ప్రచారానికి బలవంతంగా పంపించింది. జగన్ న్నే టార్గెట్ గా చేసుకొని మాట్లాడమని నాయకుల్ని నియోజక వర్గాలపైకి వదిలింది. అలవచ్చిన కేంద్రమంత్రి పురంధేశ్వరి జగన్ ది అధికార దాహం అని ఆరోపణలు చేసింది. నిజమే! మరి "మీది అధికార దాహంకాదా " అని ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేసి ప్రశ్నిస్తున్నారు.తండ్రి నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ అయిన తెలుగు దేశంలో కాకుండా, అధికారం కోసం ఎ పార్టీ అయితే ఏమి అనే ఆలోచనతో...పదవీ కాంక్ష ఉన్నప్పుడు పార్టీ సిద్దాంతాలతో పనిలేదనే అభిప్రాయంతో కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవిని పొందింది. ఇది అధికార దాహంకాదా అని పురంధేశ్వరి ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పగ్గాలు చంద్రబాబు చేతికి పోయాక బాబుతో పోటీపడలేని ఈ దంపతులు రామారావు పేరుతో కాంగ్రెస్ లో పదవిని పొంది అనుభవించేది అధికార దాహంకాదా అని మేథావులు ప్రశ్నిస్తున్నారు.
No comments:
Post a Comment