Monday, June 4, 2012

పార్టీలకు అతీతంగా...

తెలుగు దేశం పత్రికగా ముద్రపడిన "ఈనాడు", బాబు బినామి పత్రిక గా బయట ప్రజలు అనుకునే "ఆంధ్రజ్యోతి" పార్టీలకు అతీతంగా(వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మినహాయించి) జగన్ కేసు వెలుగులో కొచ్చినది మొదలు వార్తలు ప్రచురించడం ప్రజలకు విస్మయాన్ని కలుగ జేస్తుంది. అన్ని పార్టీల ఉమ్మడి శత్రువు జగన్ అన్నట్లు అన్ని పార్టీలవారు స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు. జగన్ గూర్చి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ పేపర్లలో వార్తగా చోటుచేసుకుంటున్నాయి. ఏది ఏమైనా జగన్ వ్యవహారం ద్వారా ఏకమైన ఈ నాయకుల ఈ రకమైన స్నేహం, ఈ పత్రికలు వారి మాటకు విలువిస్తూ ప్రచురించే ఈ వార్తల అనుబంధం ఎంతకాలం నిలిచి ఉంటుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment