సి.బి.ఐ.కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తుంది అని ఇటీవల జగన్ వ్యవహారంలో మాత్రమే సి.బి.ఐ. వ్యవహరిస్తున్న తీరునుబట్టి ఇట్టే అర్థమై పోయింది. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా...పనిచేసినా ఇటలీ కాంగ్రెస్ చట్టాన్ని తనచేతిలోకి తీసుకొని బెదిరిస్తుందని నిరూపించే మరో తాజా సంఘటనే బాబా రాందేవ్ ట్రస్ట్ వ్యవహారాలలో వివిధ శాఖలు వ్యవహరిస్తున్న తీరు. కేంద్రప్రభుత్వం అవినీతి పై, అనేక విషయాలపై ఆరోపణలు గుప్పిస్తూ అన్నా హజారే ,బాబా రాందేవ్ సంయుక్తంగా దీక్ష చేస్తున్నందుకు కేంద్రప్రభుత్వం ప్రతిచర్య మొదలైంది. 58 కోట్లు కట్టాలని ఐ.టీ.శాఖ, యోగా శిభిరాలద్వార వచ్చిన ఆదాయంపై 4.94 కోట్లు సేవా పన్ను కట్టాలంటూ సేవా పన్ను విభాగం వారు రాందేవ్ కు దీక్ష చేస్తున్న ఈ సమయంలో నోటీసులు ఇవ్వడం వెనుకున్న కేంద్రప్రభుత్వం ప్రమేయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సి.బి.ఐ. నే కాదు, ఐ.టీ.శాఖ, సేవా పన్ను విభాగం ఇలా ఏ శాఖలనైనా తమ స్వప్రయోజనాలకు వాడుకుని బెదిరించే కాంగ్రెస్ నైజాన్నిగమనించవచ్చు. నిజంగా రాందేవ్ అంత డబ్బు కట్టాలే అనుకుందాము. మరి ఇన్నాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ఈ శాఖలు మౌనంగా ఎందుకున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.ఉద్యోగులుగా విధులను ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు,మేథావులు డిమాండ్ చేస్తున్నారు. కాలం దగ్గరబడినప్పుడు పార్టీలు ఇలానే వ్యవహరిస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.
No comments:
Post a Comment