Thursday, May 10, 2012

వినియోగదారుల జేబులకు చిల్లి పెడుతున్న లలతా పెట్రోలియమ్స్.



అనకాపల్లి బ్రాంచ్ ఎల్.ఐ.సి.బిల్డింగ్ ప్రక్కనున్న  లలతా పెట్రోలియమ్స్ బంక్ యాజమాన్యం మరియు వెహికిల్స్ కు పెట్రోల్ నింపే బోయ్స్ కుమ్మక్కై వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫీడింగ్ పంప్ ఉండంగా కూడా జెట్ పంప్ తోనే పెట్రోల్ కొడుతున్నారు. కారణం వినియోగదారులకు చిల్లర ఇవ్వాల్సిన పని ఉండదు. లీటర్ల లెక్కన పెట్రోల్ కొట్టించుకోవాలంటే తగిన చిల్లర ఉండదు గనుక ఇప్పుడందరూ రూపాయల లెక్కనే పెట్రోల్ కొట్టించు కుంటున్నారు. ఉదాహరణకి: వందరూపాయలకు జెట్ పంప్ ద్వారా పెట్రోల్ కొట్టించుకోవాలంటే వెహికిల్ ట్యాంక్ లో పడే పెట్రోల్ రూ.99 .75  పైసలది మాత్రమే. అదే ఫీడింగ్ పంప్ ద్వారా పెట్రోల్ కొట్టిస్తే వందరూపాయలకూ పడుతుంది ఆ పంప్ లో ఎలాంటి మతలబు, మోసమూ లేకుండా ఉంటే!. రోజురోజుకు పెట్రోల్ రెట్లు పెంచే గవర్నమెంట్ ఒకవైపు...కల్తీని అడ్డుకోకుండా లంచాలకుమరిగి పెట్రోల్ బంకువారికి సహకరిస్తున్న అధికారులు మరొకవైపు. వినియోగాదారులుకు అక్రమాలను నిలదీసే అధికారం ఉంది.కొరవడింది చైతన్యమే. 

No comments:

Post a Comment