Sunday, May 27, 2012

Y.S.Jagan Arrest by C.B.I.

జగన్ అరెస్ట్ అప్రజాస్వామికం. కాంగ్రెస్ పార్టీ జగన్ ని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఉపఎన్నికల సమయంలో అరెస్ట్ చేసింది అని ప్రజలు భావిస్తునారు.

Thursday, May 24, 2012

బరితెగించి మాట్లాడుతున్న మంత్రులు


     రాష్ట్రంలో సి.బి.ఐ.జరుగుతున్న అవినీతి విచారణ తంతు రోజుకొక మలుపు తిరుగుతుంది. తాజాగా రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి మోపి దేవి వెంకట రమణా రావు అరెస్ట్ ఉదంతం తో మంత్రులు అయోమయంలో పడి ఏమి మాట్లాడుతున్నామో అనేది కూడా ఆలోచించకుండా బరితెగించి మాట్లాడుతున్నారు. నిన్న  మోపి దేవి వెంకట రమణా రావు , రేపు నేను (మేము) నేను అరెస్ట్ కావచ్చు అనే ధోరణితో రాష్ట్ర మంత్రులు "మోపిదేవికి అండగా ఉంటాం"అని అని బహిరంగంగా రాష్ట్ర మంత్రివర్గం అనడంటే ప్రజలంటే, ప్రజాస్వామ్యమంటే భయం లేని వారి తత్వాన్ని గ్రహించ వచ్చు. ప్రతిపక్షాలు, వ్యతిరేకులను అరెస్ట్ చేస్తే "విచారణ  కదా! తప్పు చెయ్యనప్పుడు భయమెందుకు?" అని దీర్ఘాలు తీసి మాట్లాడే ఈ అవినీతి మంత్రులకు, దోపిడీ నాయకులకు ఎందుకింత భయం. తర్వాత వంతు మీదనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్న నాయకులను (పాలకపక్షం వారిని తప్పించి) ఎవరినైనా విచారించ వచ్చు. చట్టం తమ పని తాము చేసుకు పోతున్నారని శాంతి సంరక్షకుల్లా, నీతి కోవిదులులా మాట్లాడే నాయకులకు ఇప్పుడు ...చ్చ పడుతుందా? ఐ.ఏ.ఎస్. లు, నాయకులు ఎంత అవినీతి చేసినా విచారించ కూడదు. నాయకుల వైఖరికి నిరసనగా ప్రజలు ఏకమై నాయకుల అవినీతిపై గళ మెత్తాలి. అవినీతి మంత్రులకు మిగతా మంత్రులే కాదు,ప్రతిపక్షం వారు కూడా అండగా నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. నాయకుల జీత భత్యాల పెంపు, పెన్షన్ మొదలగు ఉమ్మడి ప్రయోజనాల విషయంలో వివిధ పార్టీల, నాయకుల వాదోప వాదనలు, వాక్ అవుట్ లు లేకుండా స్వల్ప వ్యవధిలోనే బిల్లు లు పాస్ అవుతాయి. ఎందుచేతనంటే వారందరి ప్రయోజనం. జనం సోమ్మేగా! అనే భావన.
     నోట్లో వేలు పెడితే కొరక లేని అమాయక చక్రవర్తులు మన రాష్ట్ర మంత్రులు."మాకేమైనా మేలు జరిగిందా?", "కేవలం సంతకాలు చేసినందుకే ఇంత తీవ్ర చర్యలా?" .ఇవి సదరు మంత్రులు పాపం పసిపిల్లల్లా మాట్లాడే మాటలు.  "అవినీతి చెయ్యనప్పుడు మీకు భయమెందుకు?" "అవినీతి చెయ్యనప్పుడు మీ ఆస్తులపై సి.బి.ఐ.ని విచారణ చేపట్టమనండి. ఆర్థికంగా మేము లబ్ది పొందలేదని నిరూపించు కొండి!" అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు వణికి పోయే నాయకులను.మంత్రి వర్గం లోని 
ప్రతి ఒక్కరి ఆర్ధిక వ్యవహారాలపై సి.బి.ఐ. కూలంకషంగా విచారణ చెయ్య వలసిందిగా  అనకాపల్లి న్యూస్ .కామ్ పజల పక్షాన డిమాండ్ చేస్తుంది. 

Wednesday, May 23, 2012

పారదర్శకత లేని వ్యవస్థలు

    
     వివిధ ఆరోపణలను ఎదుర్కొనే వారిని, వివిధ శాఖలు అదుపులోకి తీసుకోవడం ఒక సంచలనాత్మకమైన వార్తగా అన్ని న్యూస్ ఛానెల్స్, దిన పత్రికలు పతాక శీర్షికలతో రాస్తుంటారు. రెండు మూడు రోజులు హంగామాగా చేస్తుంటారు. ఫలానా తారా చౌదరి కేసులో ఫలానా టి.డి.పి. ఎం.ఎల్.ఎ.రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది అని మీడియానే చెబుతుంది. తారా చౌదరి కొందరి ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు కథనాలు ప్రసారం చేస్తాయి. దమ్ముంటే నిరూపించ మనండి అని ఆరోపణలు ఎదుర్కునే వారు సవాలు విసురుతారు. ఈ హడావిడంతా రెండు మూడు రోజులే! ఆ తర్వాతా ఆ కేసు ఊసే ఉండదు. లొంగిపోయిన నిందితులు  ,నిందితురాలు నుంచి పోలీసులు ఏమి సమాచారాన్ని రాబట్టారో, ఏ ఏ ప్రశ్నలు సంధించారో పోలీసువారికి, సిబి ఐ వారికి తప్పించి మూడో కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు.  వాస్తవాల ఆధారంగా 'నిందితులు  శిక్షార్హులు' అనేదే విచారించే శాఖల ప్రధాన ఉద్దేశ్యమైతే విచారణను పారదర్శకంగా చెయ్యవచ్చుకదా? మీడియాను అనుమతించి విచారణను వీడియోగా చిత్రికరించవచ్చు. సమాజంలో ఒకమోస్తరు గుర్తింపు వున్న వ్యక్తి చస్తే స్మశానానికి వెళ్లి లైవ్ టెలికాస్ట్ చేసే చానెళ్ళు ఎటూ ఉన్నాయి. అవి విచారణ తంతును టెలికాస్ట్ చేస్తాయి.  లేదా విచారణాదికారులు   మీడియాకు విచారణ కు సంబంధించిన సి.డీ.లను ఇస్తే ప్రసారం చేసుకుంటాయి. ఇదంతా పార దర్శకంగా ఉండాలనే భావన ప్రభుత్వానికి,ఆయా శాఖలకు  ఉంటే సాధ్యం కానిది, చట్ట విరుధమైనది కాదు. ఇలా చేస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ప్రయోజనం ఉండదుకదా? ఎన్నో కేసుల్లో పెద్దవాళ్ళ పేర్లు మొదట వినిపించాయి. ఆ తర్వాతా వాళ్ళ ఊసే ఉండదు. ఈ లోపే ప్రభుత్వ స్థాయిలో, పోలీసు బాసుల స్థాయిలో రావాల్సిన అవగాహనకు వారు వచ్చి ఒప్పందాలు కుదిరిపోతాయి. ఇప్పుడు తాజాగా జగన్ అక్రమ  ఆస్తుల  కేసుకు సంబంధించి జరిగే విచారణ కూడా గోప్యంగా ఉంది. కే.వి.పి.లాంటివారు ప్రభుత్వానికి అనుకూలురుగా ఉంటూ తననూ సి.బి.ఐ.విచారణ చేస్తారేమో అనే విచారమే లేకుండా హాయిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు (చేయిస్తున్నారు). వోక్స్ వెగన్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న బొత్స కూడా నీతిపరుడే! లిక్కర్ సిండికేట్ విచారణ నుంచి ఛాక చక్యంగా బొత్స సి.బి.ఐ.ని బుజ్జగించి తప్పించుకున్నాడు. ఇవేవీ అక్రమార్జన కేసులు కాదు అన్నట్లు సి.బి.ఐ.లక్ష్మీ నారాయణ వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వానికి ధిక్కార స్వరం వినిపించిన వారే ఇప్పుడు విచారణను ఎదుర్కుంటున్నారు. మంత్రులను విస్మరించి అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. మంత్రులలో కొందరినైనా విచారించక పోతే ప్రజలనుంచి విమర్శలు వస్తాయని సి.బి.ఐ. కొందరు మంత్రులను పెళ్ళికి పిలిచినట్లు పిలుస్తుంది. హోం శాఖా మంతిరి అలా  పిలిపించి విచారణ మమా అనిపించారు. వారు వీడియా ముందుకు వచ్చి సి.బి.ఐ.వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చాను అని కూల్ గా సమాధానం చెప్పి వెళుతున్నారు, అవినీతికి తాము ఆమడ దూరం అన్నట్లు!
     కనుక విచారణ భాగోతాలను వివిధ దశలలో కాకున్నా విచారణ మొత్తాన్ని కోర్టు స్థాయికి వెళ్ళే సందర్భంలోనైన ప్రజాస్వామ్య వ్యవస్థలో గొప్పదైన ప్రజా కోర్టుకు తెలియ జేసే ప్రయత్నం సి.బి.ఐ.చెయ్యాలి. లేదా ప్రముఖ పౌర సమాజం సభ్యుల సమక్షంలో విచారణ జరిగినప్పుడే సి.బి.ఐ.ని, పోలీసు వ్యవస్థను ప్రజలు విశ్వసిస్తారు.
  

కాంగ్రెస్ కు కాలం చెల్లనుంది


కేంద్ర ప్రభుత్వ పనితీరు చూస్తే కేంద్రప్రభుత్వానికి కాలం చెల్లనుందని అర్థమౌతుంది. గడిచిన మూడు సంవత్సరాలలో ప్రజలకు వారు ఏమి సేవచేశారానో ఆ సంబరాలు. దినదిన గండంగా ప్రభుత్వాన్ని ఈ మూడేళ్ళు నెట్టు కొచ్చినందుకే  ఈ సంబరం అన్నట్లు దేశరాజధానిలో సంబరం చేసుకున్నారు. వెనువెంటనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచారు. కుంభ కోణాల యు.పి.ఏ.ప్రభుత్వం పెట్రోల్ కంపెనీలనుంచి ఎంత ముడుపులు అందుకొని ఉన్న పళంగా పెట్రోల్ ధరలు పెంచారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓడిపోతుందని తెలిసే మిగిలిన రెండు సంవత్సరాలలో ఇష్టా రాజ్యంగా దేశాన్ని దోచుకోడానికి వెనుకాడడం లేదు. ప్రజలకు భయపడడం లేదు. అదేమంటే  కాంగ్రెస్ జాతీయ పార్టీ. 130  సంవత్సాల పై చరిత్రగల పార్టీ  అని గొప్పలు చెప్పు కుంటున్నారు. ప్రతి ఊరిలో పుట్టకూ గుట్టకూ కూడా ఏళ్ల చరిత్ర వుంటుంది. నియంతలకూ,మహనీయులకు చరిత్ర ఉంటుంది. అందుకే ఇందిరా గాంధీ కాలంనాటి ఎమర్జెంసీ రోజులను తలపింపజేస్తూ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కేంద్రంలో  యు.పి.ఏ.ప్రభుత్వం , ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. సోనియా కుటుంబం, కుటుంబమే పిల్లా పాపలతో వెళ్లి ఉత్తర ప్రదేశ్ లో ప్రచారం చేస్తే ప్రజలు తిరస్కరించినా సిగ్గు రాలేదు. భోఫోర్సు కుంభకోణం తెరమీదకి రాకుండా ఉండాలంటే  సోనియాగాంధీ రాజకీయంలో ఉండకతప్పదన్నట్లే వ్యవహరిస్తుంది. అసలు కాంగ్రెస్ నాయకుల ఆస్తులు ఎవరెవరివి ఎంతెంత స్విస్ బ్యాంక్ లో మూలుగుతున్నాయో ఊహకి అందడం లేదు. స్విస్ బ్యాంక్ లోని నల్ల ధనాన్ని భారత్ కి రప్పించడం అలా ఉంచండి, ఆ ధనాన్ని దేశ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టడం అలా ఉంచండి. కనీసం....భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు కూడా  యు.పి.ఏ.ప్రభుత్వం ప్రకటించలేక పోయిందంటే కాంగ్రెస్ నాయకుల ఖాతాలు ఎందరివి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Friday, May 18, 2012

ముఖ్య మంత్రి అధికార దుర్వినియోగం


ఉప ఎన్నికల వేళ పాలక పక్షం వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తెలివిగా మంత్రులను ఉపఎన్నికలు జరిగే నియోజక వర్గాలకు ఇంచార్జ్లుగా నియమించడంతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు సదరు మంత్రిగారిదగ్గరకి క్యూ కడుతున్నారు.ఇది ఇలా ఉంటే స్వయంగా ముఖ్య మంత్రే ఎన్నికల ప్రచారం చెయ్యడం జరుగుతుంది. ఈ పని అతని పార్టీకి సంబంధించినదే అయినప్పటికీ ఈ సందర్భంగా 
  • ముఖ్య మంత్రి వినియోగించే వాహనాలు ఏమిటి?
  • ముఖ్య మంత్రి విడిది చేసే బంగ్లాలు,వసతుల మాటేమిటి?
  • ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా వినియోగించే కాన్వాయ్ మాటేమిటి?
ఇవన్నీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే పనులే. మే 19 , 2012 న నెల్లూరు జిల్లా ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా జన సమీకరణ లో భాగంగా మంత్రుల ఆదేశంతో అధికారులు ఉపాది హామీ పథకం క్రింద పనిచేసే వారిని ఈ సభలకు తరలించారు. ప్రజా ధనాన్ని ఇలా పార్టీపరంగా ఉపయోగించుకున్నారు. ముఖ్య మంత్రి ఒక పార్టీకి చెందిన నాయకుడే కావచ్చు. ముఖ్య మంత్రి ఎవరు?ఎ పార్టీకి చెందినా వారు అనే భేదం లేకుండా ఉప ఎన్నికల వేళ   ముఖ్య మంత్రిగా ఉన్నవారు ప్రచారానికి వెళ్ళడానికి వీలులేదు అనే చట్టాన్ని తీసుకు రావాల్సి ఉంది. చిన్న చిన్న విషయాలకు కోడ్ ఉల్లంఘన అని గోల చేసే "ఎన్నికల సంఘానికి, అధికారులకు" జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగం, నాయకుల  స్వప్రయోజనాలకోసం ఖర్చై పోతున్న ప్రజా ధనం గూర్చి ఆలోచనే లేదు. ఈ విషయానికి సంబంధించి మేథావులు ఆలోచించాలి. ప్రజా ధనాన్ని పరిరక్షించాలి. 

Thursday, May 17, 2012

అప్రజాస్వామికంగా ప్రభుత్వం...



వై.ఎస్.మంత్రి మండలి 

జగన్ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు దిగినట్లు సామాన్యులకు సైతం స్పష్టమౌతుంది. గత ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ వారికి ఇంకా సిగ్గు రాలేదని గ్రహించాలి.. మరలా ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేని రాష్ట్ర కాంగ్రెస్ కేంద్రం సహకారంతో, సి.బి.ఐ.ని తన ఆయుధంగా మలుచుకొని వ్యక్తిగతంగా జగన్ పైకి దాడికి దిగింది. ఇప్పటివరకు అభియోగం మోపబడిన వారినెందరినో సి.బి.ఐ. విచారించింది వేరు వేరు కేసుల్లో. విచారణ జరుగుతున్న దశలో ఏవొక్క కేసులోనూ విచారింప బడుతున్న వారి ఆస్తులను అటాచ్ మెంట్ కోరుతూ సి.బి.ఐ. ప్రభుత్వాన్ని అడిగిన సందర్భాలు పెద్దగ లేవు. సి.బి.ఐ.అడిగిందే తడవుగా అన్నింటిలోను నత్తనడకను ప్రదర్శించే ప్రభుత్వం వెను వెంటనే వారి అభ్యర్థనను ఆమోదించిన సందర్భాలూ లేవు. ఈ పరిణామాలన్నీ కక్ష సాధింపు చర్యలని రుజువు చేస్తున్నాయి.

సి.బి.ఐ. విచారణ లోనే ఎన్నో లోపాలు:
సి.బి.ఐ.వారు చిత్త శుద్ధితో కేసు విచారణ చెయ్యడం లేదు. కారణం అత్యున్నత కోర్టు స్థాయిల్లో వారి వాదన ఓడిపోతుంది. వారికి తెలిసినా ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశం గనుక!

ఇలా విచారించాలిగాదా!:
  • వ్యక్తిగతంగా కొందరికి లబ్ది చేకూర్చినందుకే వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని; అలా జగన్ కోట్లాది రూపాయలు కూడబెట్ట డన్నదే ప్రధాన అభియోగం. అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గ ఆమోద ముద్రతోనే ఇవి చేసినప్పుడు మంత్రి వర్గంలోని మిగతా మంత్రులను సి.బి.ఐ. విచారించక పోవడాన్ని ఏమనాలి?
  • కొందరికి వ్యక్తిగత ప్రయోజనాన్ని కలిగించినందుకు ముట్టిన ప్రతిఫలాన్ని ఒక్క వై.ఎస్.మాత్రమే పొందగా మిగతా మంత్రులు ఎటువంటి ప్రయోజనాలు పొందకుండా అందులో వాటాలేకుండా ఉండే అంత అమాయక చక్రవర్తులా? నోరులేనివారా? నిస్వార రాజకీయ నాయకులా?
  • జగన్ స్థాయిలో మంత్రివర్గం లోనివారికి కంపెనీలు లేకపోవచ్చు. వై.ఎస్. వాళ్ళ లబ్ది పొందినవారు ఇలాంటి మంత్రులకు వారికివ్వాల్సిన వాటాను పెట్టుబడులుగా కాకపోయినా ధనరూపంలో నైన ఇచ్చి ఉండాలిగా? అది తెలుసు కోడానికి మంత్రి వర్గంలోని అందరి ఆస్తులపై సి.బి.ఐ.దర్యాప్తు చెయ్యాలిగా? అలా చెయ్యడం లేదు ఎందుకు?
  • మంత్రివర్గం జారీచేసిన జీ.ఓ.లను అమలుచేసిన అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు, ఆ జీ.వో.లకు సూత్రధారులైన అప్పటి మంత్రి వర్గం లోని వారిని జగన్ ని విచారిస్తున్న పద్దతిలోనే సి.బి.ఐ.వారు అప్పటి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?
ప్రతిపక్షాలు, మేథావి వర్గాలు ఏం చేస్తున్నారు:


న్యాయానికి విరుద్ధంగా ఒకరికి ఒక పద్ధతి, మరికొందరికి మరో పద్ధతి అన్నట్లు వ్యవహరిస్తున్న సి.బి.ఐ.ని ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదు. ఏ ఒక్క పార్టీ  విమర్శలు గుప్పించడం లేదు. అప్పటి మంత్రి వర్గం వారందరిపై ఇటువంటి విచారణనే చేపట్టామని గట్టిగా అడగక పోవడానికి కారణం అన్ని పార్టీల ఉమ్మడి శత్రువు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, దాని నాయకుడు జగన్. మీడియాలో మాట్లాడుతున్న నాయకుల మాటల్ని గమనిస్తుంటే రాష్టంలో జగన్ తప్పించి అందరూ పవిత్రులు, దోపిడీ అంటేనే తెలియదన్నట్లు మాట్లాడు తున్నారు. నిజం రుజువు చేసుకోడానికి ఏ ఒక్కరు సి.బి.ఐ.ని ఆహ్వానించరు కదా...ఎవరైనా ఫలానా మంత్రిని విచారణ జరపమని అంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటారు. బొత్సా లాంటి వారి బండారం బయటపడుతున్న దశలో కీలకమైన, ఖచ్చితమైన సిన్సియర్ ఆఫీసర్లు ప్రమోషన్ల పేరుతో మాయమై పోతారు. రాజకీయ నాయకులు సరే...మేథావి వర్గం ఏమి చేస్తున్నారు? ఎందుకు మౌనం?

Monday, May 14, 2012

నాటి ఆంధ్రదేశపు అ(ప్ర)ధమ పౌరుడు


కాంగ్రెస్ హై కమాండ్  పంపగా మన రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ గిరి వెలగబెట్టేందుకువచ్చి ఘనకార్యం చేసి ఘనుడు తివారీ . అతగానికి ఇలాంటి ఘన చరిత్రలు దేశంమొత్తం మీదా చాలానే ఉన్నాయని లోక విదితం. పెద్దోళ్ళ కొక న్యాయం, పేదోళ్ళ కొక న్యాయమన్నట్లు న్యాయస్థానాలు వ్యవహరిస్తున్నాయి. తివారినే తన తండ్రి. కావాలంటే డి.ఎన్.ఏ. పరీక్ష చేసి నాకు న్యాయం చెయ్యండి అని రోహిత్ శర్మ మూడు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నాపోలీస్ శాఖా, న్యాయ శాఖలు మౌనంగా ఉండిపోయాయి. ఇన్నాళ్ళకి కాస్త కోర్టు కళ్లెర్రజేస్తూ రక్త పరీక్షకు నిరాకరించే తివారిని హెచ్చరించింది. నేటి రాజకీయ నాయకులకు పదవులు రక్షణ కవచంలా ఉపయోగపడడం , ఆ అండతో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలనీ సాగించడం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి తివారీలు నేటి రాజకీయ రంగంలో తక్కుమందేమి లేరు. డిల్లీ హైకోర్ట్ ఇచ్చిన రెండురోజుల గడువులోపు రక్త పరీక్ష ఇచ్చి నేరం రుజువు కాబడి పరువు పోగొట్టుకునేకన్నా, క్షమాపణ కోరి ఆతనిని తన కుమారునిగా తివారీ అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారు అని మేథావి వర్గం భావిస్తుంది.

బ్రాహ్మణీ కేటాయింపుల్ని వెనక్కి తీసుకోవాలి


గాలి జనార్థన్ రెడ్డికి, 2007 మే 21 , నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకూ ఎటువంటి ఉత్పత్తి కాదుగదా, కర్మాగార నిర్మాణం కూడా జరగలేదు. కనుక అనేక వసతులు,రాయితీలతో పాటు ప్రధానంగా గాలికి కట్టబెట్టిన 14 ,549 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవడమే కాదు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించ నందుకు జరిమానాని కూడా విధించి వసూలు చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

గిరిజనులపై వై.కిషోర్ చంద్రదేవ్ కి ఎంత ప్రేమో!!!!!!!!!!!!


వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణాంతరం రాష్ట్ర నాయకులే కాదు, కేంద్ర స్థాయి నాయకులూ తమ నాలుకలను ఎటుకావాలంటే అటు తిప్పి మాట్లాడుతున్నారు. ఆంధ్రదేశంలో ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి క్యాబినెట్ బాక్సైట్ త్రవ్వకాలగూర్చి తీసుకున్న నిర్ణయాలను గూర్చి సదరు కేంద్ర మంత్రి చంద్రదేవ్ గారు అనేకసార్లు స్వయంగా  వై.ఎస్. .తోనే భేదించినట్లు "దొంగలుబడ్డ ఆరు నెలలకు "అనే సామెతలాగా వై.ఎస్.చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత...ఉపఎన్నికల సమయంలో పేపర్లనిండా తన బూటకపు ఆవేదనను వ్యక్త చేస్తున్నారు. వై.ఎస్.నిర్ణయాలను ఆ సమయంలో ఒక్కసారి విభేదించినట్లు నిరూపించాగాలడా అని సవాలు విసురుతున్నారు కొందరు. డిల్లీలో  ఉండి  తన రాజకీయ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇప్పటివరకు చూసుకుంటున్న మంత్రిగారు ఇప్పటివరకూ తన జాతిజనుల సంక్షేమం కోసం తానూ చేసింది ఏమీ లేదని గిరిజనులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిరిజనుల అభివృద్ధికి మంత్రిగారు పాటుపడాలని మేథావులు సూచిస్తున్నారు.

Sunday, May 13, 2012

సి.బి.ఐ.ని ఎత్తి వేసెయ్యండి

ప్రజా స్వామ్య వ్యవస్థలో  ఒక వ్యక్తిమీద గాని, సంస్థ మీదగాని మోపబడిన నిందను, అభియోగాన్ని, జరిగిన నేరాలు - ఘోరాలపై  నిష్పాక్షిక విచారణను జరిపించి వాస్తవిక విషయాలను రాబట్టేందుకు ఏర్పాటు గావింపబడిన శాఖే సి.బి.ఐ.  సి.బి.ఐ. ని ప్రభుత్వాలు వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించు కుంటున్నాయి అని ఇప్పటివరకూ నిరూపించిన సంఘటనలు అనేకం. అది ఏ పార్టీ ఐనా గాని. పాలక పక్షం ప్రతిపక్షాలను,ఇతర పార్టీలను నోరు మూయించేందుకు, తమ దారికి రానివారిని,మాట వినని వారిని దారికి తెచ్చుకునేందుకు సి.బి.ఐ ని అధికార పక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటివరకు సి.బి.ఐ.ద్వారా (అవినీతి పరులను శిక్షించి) ప్రజాస్వామ్యానికి న్యాయం చేసినదానికంటే  ప్రభుత్వా లకు అనుకూలంగా వ్యవహరించి అధికార పక్షం వారికి సేవచేసిందే ఎక్కువ. ఇలా సి.బి.ఐ.ని "Congress Bureau of Investigation" అన్నట్లు అనేక మార్లు దుర్వినియోగ పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. సి.బి.ఐ. ఎవరి ప్రమేయం లేకుండా తనపని తానూ చేసుకు పోతుంది అనిపించే సంఘటనలు వేళ్ళపై లెక్కించ వచ్చు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే భవిష్యత్తులో  వారి భవిష్యత్తు బాగుంటుందనే స్వార్ధంతో కొందరు అతిగా వ్యవహరించడం కూడా చూస్తున్నాము. ఇప్పటివరకు జరిగిన అనేక స్కాంలు వెలుగులోకి వచ్చినా, ఫలాని నాయకుడు అవినీతిపరుడు , విచారించండి అని ఫిర్యాదు చేసింది ఒకరిపై ఒకరికి గిట్టని నాయకులేగాని ప్రజలుకాదు, మేధావి వర్గం కాదు. ప్రాథమిక సాక్ష్యాలతో సామాన్యులు సైతం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి విచారించిన నాడే ప్రజలకు సి.బి.ఐ. పై మంచి అభిప్రాయం కలుగుతుంది. అలాకాకుండా ఈవిధంగా ప్రభుత్వాలకోసమే మేము పనిచేయ్యాలన్నట్లు వ్యవహరిస్తున్న సి.బి.ఐ.ని ఎత్తివెయ్యడం మంచిదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం జేస్తున్నారు.   


మనిషిపోయాక ఏమైనా మాట్లాడతారు!



మనిషిపోయాక ఏమైనా మాట్లాడతారు అనే మానవ సహజ లక్షణాన్నినిస్సిగ్గుగా మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బహిరంగ సభలో వ్యక్తం చేశారు. "వై.ఎస్.నాకు రాజకీయ జీవితం ఇవ్వలేదు" అంటున్నారు. 2004 - 2009 మధ్య కాలంలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చింది వై.ఎస్.కాదు కాబోలు.  2009 తర్వాత కిరణ్ కుమార్ ని స్పీకర్ ని  చేసింది వై.ఎస్.కాదు కాబోలు. కిరణ్ కుమార్ తన  స్థల్లన్ని ఆక్రమించుకున్నాడని ఒక బాధితుడు రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆవరణలో చెట్టెక్కి ఉరిపోసుకుంటా నని మీడియాముందు గొడవ చేస్తే రక్షించింది వై.ఎస్.కాదు కాబోలు!.  పదవిని కాపాడుకోవడానికి...ఓట్లు రాబట్టుకోడానికి జనాలు వెర్రోళ్ళు అన్నట్లు, ఏం మాట్లాడినా  వింటారు, నమ్ముతారు అని కిరణే కాదు ఏ నాయకుడు అనుకోవద్దు. అధికారం కోసం నాయకులు విలువలు లేకుండా ఇంతగా దిగజారి పోతారా అని ఆశర్యపోతున్నారు జనం.

Thursday, May 10, 2012

వినియోగదారుల జేబులకు చిల్లి పెడుతున్న లలతా పెట్రోలియమ్స్.



అనకాపల్లి బ్రాంచ్ ఎల్.ఐ.సి.బిల్డింగ్ ప్రక్కనున్న  లలతా పెట్రోలియమ్స్ బంక్ యాజమాన్యం మరియు వెహికిల్స్ కు పెట్రోల్ నింపే బోయ్స్ కుమ్మక్కై వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫీడింగ్ పంప్ ఉండంగా కూడా జెట్ పంప్ తోనే పెట్రోల్ కొడుతున్నారు. కారణం వినియోగదారులకు చిల్లర ఇవ్వాల్సిన పని ఉండదు. లీటర్ల లెక్కన పెట్రోల్ కొట్టించుకోవాలంటే తగిన చిల్లర ఉండదు గనుక ఇప్పుడందరూ రూపాయల లెక్కనే పెట్రోల్ కొట్టించు కుంటున్నారు. ఉదాహరణకి: వందరూపాయలకు జెట్ పంప్ ద్వారా పెట్రోల్ కొట్టించుకోవాలంటే వెహికిల్ ట్యాంక్ లో పడే పెట్రోల్ రూ.99 .75  పైసలది మాత్రమే. అదే ఫీడింగ్ పంప్ ద్వారా పెట్రోల్ కొట్టిస్తే వందరూపాయలకూ పడుతుంది ఆ పంప్ లో ఎలాంటి మతలబు, మోసమూ లేకుండా ఉంటే!. రోజురోజుకు పెట్రోల్ రెట్లు పెంచే గవర్నమెంట్ ఒకవైపు...కల్తీని అడ్డుకోకుండా లంచాలకుమరిగి పెట్రోల్ బంకువారికి సహకరిస్తున్న అధికారులు మరొకవైపు. వినియోగాదారులుకు అక్రమాలను నిలదీసే అధికారం ఉంది.కొరవడింది చైతన్యమే. 

విఫలమౌతున్న పోలీసులు

రోజురోజుకు బంగారం విలువ పెరిగిపోతూ ఉండడంతో అదేస్థాయిలో,అదే వేగంతో చైన్ స్నాచింగ్ కేసులూ పెరుగుతున్నాయి.  ఇటువంటి సంఘటనలను నివారించడంలో అనకాపల్లి పోలీసులు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ   అంతిమంగా సంఘటనలు పునరావృతం కాకుండా చెయ్యడంలో విఫలమౌతున్నారని చెప్పక తప్పదు. అడపా దడపా  చైన్ స్నాచెర్స్ పట్టుబడగా వారినుంచి రికవరీ చేసిన బంగారాన్నిసంబందితులకు అప్పజెప్పడంలోకూడా పారదర్శకతలేదని భాదితులు అనుమానాలు వ్యక్తం జేస్తున్నారు. ఏది ఏమైనా  ఇటువంటి సంఘటనలు తగ్గుముఖంపట్టేలా పోలీసులు మరింత కృషి చెయ్యాలని ప్రజలు భావిస్తున్నారు.