Wednesday, January 25, 2012

ది గ్రేట్ ఇండియా The Great India

భారత దేశ ప్రజలు సహనశీలులు, శాంతి కాముకులు. ఎవరిద్వారనైన ఇబ్బందిని అనుభవించాల్సి వస్తే  "దాని/వారి  పాపాన అదేపోతుంది"....లేదా " మన కర్మ ఇంతే " అని సరిపెట్టుకునే కర్మ సిద్దాంత పండితులు అని నిరూపించే ఘటన కొన్ని ఏళ్లుగా సాగుతుంది. స్థానిక అనకాపల్లి కొత్తూరు కాలేజీ జంక్షన్ వద్ద రైల్వే క్రాసింగ్ రోడ్ పై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమై మూడు సంవత్సరాలు దాటి పోతుంది. ఏ ఒక్కటి సక్రమమైన పద్దతిలో జరగలేదు. ఒక వంతెన నిర్మాణం జరిగేటప్పుడు ఆ మార్గాన వెళ్ళే వారికి పక్కగా మార్గాన్ని నిర్మించిన తర్వాత బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలి. నిర్మాణ పనులు ప్రారంబించిన రోజు మొదలు ఈ మార్గంగుండా వెళ్ళే ప్రజలకు నరకంగా మారిపోయింది ప్రయాణం. వర్షాకాలం లో బురదలో పడి కళ్ళు చేతులు విరగ గొట్టుకున్న వాళ్ళు  ఎందఱో...ఇతర కాలాలలో ఈ మార్గాన నడిచిన వారు పీలుస్తున్న దుమ్మూ ధూళి గూర్చి చెప్పసాధ్యంకాదు. ప్రజలు ఫిర్యాదు చెయ్యరు...పంచాయితీ సర్పంచులు...అధికారులు...నాయకులు కమీషన్లు పుచ్చుకొని ఏమీ ఎరగనట్లు ఉంటున్నారు. అధికారగణం ఇప్పటికైనా మేల్కొని ప్రజల్ని ఈ ఇబ్బందుల నుంచి రక్షించ వలసిందిగా  కొందరు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు  .
ఈ వీడియో దృశ్యంలో మీరు గమనించవచ్చు బురదతో కాదు అవినీతి బురదతో ఆ మార్గం ఎలా రాజకీయ రొచ్చులా ఉందొ. ది గ్రేట్ ఇండియా. ది గ్రేట్ గవర్నమెంట్.

No comments:

Post a Comment